సకలజనుల సమ్మెసెగ డిల్లీకితాకి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి
జేస్తున్న తరుణమిది. తెలంగాణా జే.ఏ.సి. బృందం సమ్మెను తమ సంకల్లో
పెట్టుకొని డిల్లీ వీధుల్లో తిరుగుతూ ఉధృతమైన తెలంగాణా ఉద్యమంపై నీళ్లు
చల్లడం శోచనీయం. కాంగ్రెస్ హయాంలో తెలంగాణా బిల్లు పాస్ కావాలన్నా,
కాంగ్రెస్ "చేయి"ఇచ్చి మళ్ళీ మోసం జేసినా తెలంగాణా సాధించాలంటే మున్ముందు
బి.జే.పి. మద్దతే కావాలన్న ఇంగితజ్ఞానాన్ని పొలిటికల్ జే.ఏ.సి. నేతలు
విస్మరించడం సహించరానిది. ముఖ్యంగా బి.జే.పి. నేత సుష్మాస్వరాజ్ అనుమతిని
తీసుకొని కూడా ఆమె విలువను గుర్తించక పోవడం, నీడనిచ్చే చెట్టును చేజేతులా
నరుక్కోవడం మూర్ఖత్వం కాదా?తెలంగాణా గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని,
తెలంగాణా ఇచ్చేదాకా కాంగ్రెస్ ముఖం చూడొద్దన్నమాటకు కట్టుబడి యుండాలని
విజ్ఞప్తి.
ఇట్లు
కటంగూరు సత్యనారాయణ రెడ్డి,
టి.ఆర్.టి.యు.వ్యవస్థాపక అధ్యక్షులు
ఫోన్ నం: +1 (860) 656 6666
- kasanareddy