9వ ప్రపంచతెలుగు సాహితీ సదస్సు- 4వ ప్రకటన =నవంబర్ 22-23, 2024, దోహా, ఖతర్

4 views
Skip to first unread message

Raju Vanguri

unread,
Nov 14, 2024, 1:32:37 AM11/14/24
to vangurif...@googlegroups.com, తెలుగు మాట, houstonsahitilokam, Radhika Mangipudi, Ramaraju Vamsee, AKV/2019/A003 Venkappa Bhagavatula, Sai Rachakonda, VIKRAM

మిత్రులారా,

మరొక కొద్ది రోజులు....అనగా నవంబర్ 22-23, 2024 తేదీలలో మధ్య ప్రాచ్య దేశాలలో మొట్టమొదటి సారిగా ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో భారత పూర్వ ఉప రాష్ట్రపతి “పద్మవిభూషణ్” గౌ. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కుటుంబ సమేతంగా ప్రధాన అతిధిగా విచ్చేస్తున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు రంగం సిధ్దం అయింది. స్థానిక చిన్నారుల స్వాగత నృత్యం, ఉపాధ్యాయుల సత్కారం తో సదస్సు ప్రారంభం అవుతుంది. ఖతార్ దేశం లో భారత రాయబారి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. 

పది మధ్య ప్రాచ్య దేశాల అధ్యక్షులు, భారత దేశం, అమెరికా, ఆఫ్రికా మొదలైన అనేక ప్రాంతాల నుండి సుమారు 75 మంది వక్తలు, 250 మంది సాహిత్య ప్రతినిధులు, తెలుగు రాష్త్రాల మంత్రి వర్యులు, సినీ గేయ రచయితలు, కవులు, పండితులు నమోదు చేసుకుని ప్రయాణానికి సంసిధ్దంగా ఉన్నారు. సదస్సు తర్వాత దోహా మహానగర సందర్శనం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.  ఈ సదస్సులో ప్రముఖ కథకులు, సాహితీ వేత్త ప్రొ. రామా చంద్రమౌళి (వరంగల్) గారెకి ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ సదస్సులో విభిన్న అంశాల మీద నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, సినీ కవి మౌనశ్రీ మల్లిక్ మొదలైన సుమారు 35 మంది ప్రముఖ కవుల స్వీయ రచనా పఠనం, ఆ ప్రాంతంలో ఆచార్య అద్దంకి శ్రీనివాస్ గారు సంచాలకులుగా శ్రీమతి బులుసు అపర్ణ గారి తొలి మహిళా అష్టావధానం, కవి జొన్నవిత్తుల గారి శతక గ్రంధావిష్కరణ తో సహా 33 నూతన గ్రంధాల ఆవిష్కరణ, కొత్తగా రూపొందించబడిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి సమగ్ర వెబ్ సైట్ ఆవిష్కరణ మొదలైన అంశాలతో పాటు పుస్తక ప్రదర్శన-విక్రయశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

మొదటి రోజు..అనగా నవంబర్ 22, 2024 నాడు సాయంత్రం ప్రత్యేక ఆహ్వానితుల గౌరవార్ధం విందు భోజనం, ప్రముఖ గాయనీ గాయకులు Y.S రామకృష్ణ, లలిత దంపతులు (హైదరాబాద్),  సుచిత్ర బాలాంత్రపు (సుచిత్ర ఆర్ట్ క్రియేషన్స్, కాకినాడ), రాంప్రసాద్ (విశాఖ) వారి సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శనలు మొదలైన ఆసక్తికరమైన అంశాలతో వినోద కార్యక్రమం జరుగుతుంది.

ప్రతిష్టాత్మకమైన ఈ 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కేవలం ఖర్చుల నిమిత్తం వదాన్యుల ఆర్థిక సహకారం అర్థిస్తున్నాం. వివరాలు జత పరిచిన ప్రకటనలో చూసి స్పందించమని కోరుతున్నాం.

ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి యూ ట్యూబ్ లింక్ లో చూడవచ్చు. We will send the link ASAP. 

జత పరిచిన సమాచారం:

1.    దోహా సదస్సు నాలుగో సమగ్ర ప్రకటన

2.    కీలకాంశాలు

3.    వక్తలు, సాహితీవేత్తల ఫొటోలు

4.    ఆర్థిక సహాయానికి విన్నపం.


 

భవదీయులు

 

ప్రధాన నిర్వాహకులు

 

వంగూరి చిట్టెన్ రాజు, భాగవతుల వెంకప్ప,

విక్రమ్ సుఖవాసి, రాధిక మంగిపూడి, శాయి రాచకొండ, వంశీ రామరాజు 

 

 

4 వ ప్రకటన _ దోహా సదస్సు Final-compressed.pdf
Reply all
Reply to author
Forward
0 new messages