సర్కారు బడి సత్తా....అంతరిక్ష క్షేత్రంలో...
"నా కలలు నిజమవుతాయి...నేటి మొక్కలు రేపు వికసిస్తాయి" అని డాll ఎ.పి.జె కలాం అన్న మాటలకు కార్యరూపం ఇది...
ఎనిమిది (8) ఏళ్లుగా వందేమాతరం ఫౌండేషన్ ప్రభుత్వ బడుల ప్రక్షాళన కొరకు చేస్తున్న విద్య ఉద్యమం ఎందరో బడుగుల బిడ్డలకు భరోసానిచ్చింది...చదువు, మార్కులే కాదు సామాజిక భాద్యతగల ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే ప్రయత్నం పదవ తరగతి అధ్యయన శిక్షణ శిబిరాలలో జరుగుతుంది...పుల్లురి శరత్ కుమార్ సాధారణ విద్యార్ధి - 2007 మొదటి బ్యాచ్ విద్యార్థి...ఇక్కడ పొందిన ప్రేరణ, తల్లితండ్రి తనకోసం పడుతున్న ఆరాటం తనలో కసిని పెంచింది..అందరిని చుట్టుముట్టే బలహీనతలున్నప్పటికీ, తనముందున్న నిరంతరం ఆశయామనే అగ్నిని జ్వలింప చేసుకున్నాడు...వెనుకపడిపోతున్ననుకున్నపుడు వందేమాతరంతో మాట్లాడేవాడు...మహనీయుల త్యాగాలకంటే గొప్పదా నీ ఆరాటం అనే మాటలు తనను కర్యోన్ముకున్ని చేసాయి..
ఎంత ఎత్తుకు ఎదిగిన, ఒదిగిన సంస్కారంతో వందేమాతరం మానసపుత్రుడుగా ఎదిగిన శరత్ కు శుభాభినందనలు...
We are humbled by your achievement Sharath Kumar...We wish that you reach greater heights in life.
-వందేమాతరం