జగమంతకుటుంబం నాది

19 views
Skip to first unread message

bhavaraju

unread,
Apr 24, 2013, 5:55:02 AM4/24/13
to telug...@googlegroups.com

                                                      జగమంతకుటుంబం

                                                               

                                                                      పాట

                                                                                                                                                           

                                   పల్లవి   :  జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది

                                                 సంసారసాగరం నాదే, సన్యాసం , శూన్యం నావేలే


                                   చరణం : కవినై ,కవితనై ,భార్యనై ,భర్తనై

                                                మల్లెలదారుల్లో , మంచు ఎడారుల్లో

                                                పన్నీటిజయగీతల,కన్నీటి జలపాతాల

                                                నాతో నేను సహగమిస్తూ ,నాతో నేను రమిస్తూ

                                                ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం

                                                కలల్ని,కథల్ని ,మాటల్ని ,  పాటల్ని ,రంగుల్ని ,రంగవల్లుల్ని

                                                కావ్యకన్యల్ని ,ఆడపిల్లల్ని                                                               //జగమంత//


శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన ఈ పాట ఆధారంగా చేసుకుని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ' చక్రం ' సినిమా నిర్మించారు .కానీ బ్రతికేవాడు ఎలా బ్రతకాలో తెలిపే పాటను చావబోయే వాడు చచ్చే ముందు చెప్పే ఫిలాసఫీ గా మార్చేసారు .


                                               1+1  ×  1-1      =       1

                                                 రెండు       ఒకటి

           ( X+1 ×  X-1)+1  ×  ( 1 )-1     = 1


ఫై సమీకరణంలో '1' రెండుగా(1+1 × 1-1)  విడిపోయింది.రెండిట్లో ఒకటి   ( 1+1) తిరిగి క్రింది  సమీకరణంలో రెండుగా  అనేకం  ( X+1 ×  X-1) గా మారిపోయింది. (X)స్థానంలో ఏ సంఖ్య నైనా ప్రతిక్షేపించుకోవచ్చు.సృష్టిలో ఉన్నది ఒకటే నని అదే రెండుగా అనేకంగా మారిపోయిందని అద్వైత తత్వసారాంశం ఈ తత్వానికి ఆదిశంకరాచార్యులు ఆద్యులు .ఈ అద్వైత తత్వానికి ఫై సమీకరణం 'skeleton' అయితే దానికి రక్త మాంసాలు కల్పించి ప్రాణం పోసింది శాస్త్రి గారి పాట. నవరసాలకు మూలమైన తత్వం ఈ పాటలో ఉంది .


                                    ( X+1 ×  X-1)+1  ×  ( 1 )-1       =       1

                                              జగమంతకుటుంబం        ఏకాకిజీవితం           నేను(నాది)


జగమంతకుటుంబం :  ( X+1 ×  X-1) లో Χ బదులుగా (కవి ×కవిత),(భర్త  ×  భార్య),(భగవంతుడు × భక్తుడు ) ....ఇలా ఒకరికొకరు వరసైన జంటలను ఎన్నైనా ప్రతిక్షేపించుకోవచ్చు. కానీ ఏవరసకావరసే.తమ్ముడు తమ్ముడే  పేకాట పేకాటే, ఏమాటకామాటే .  ఒక  వరస పనిచ్తేస్తున్న సమయంలో రెండోది పనిచెయ్యదు . అలా ఏ వరసకు ఆ వరసను , ఏ రసానికి ఆ రసాన్ని విడివిడిగా గుర్తించడమే సామరస్యం .


                                         

                                                   

                                                       (2+1  ×   3-1)  ≠ 1                                                          

                                                                                                                                                                                                                                                                                                                                                   ఫై సమీకరణంలో 2 వేరు ,3 వేరు . అందువల్ల అవి ఒకటి కాలేదు (≠ 1) అలాగే మనిషి మాటలకు చేతలకు పొంతన లే​కపోతే అతడు'వ్యక్తి'కాలేడు'వ్యక్తి'త్వలోపం వంచనకు,ఆత్మవంచనకు,సంఘర్షణకు దారితీస్తుంది . ఐక్యమత్యమే బలం అన్నట్టు మనస్సు,వాక్కు,కర్మ మూడింటికి పొంతన కుదిరి ఐక్యం (ఒకటి)గా ఉంటేనే నైతిక బలం సిద్దిస్తుంది. మనోవాక్కయకర్మలలో  ఏకత్వమే చిత్తశుద్ది ,నిజాయితీ.


                                                        2 +1  ×  2 –1    =  1

                                                        3 +1  ×  3 –1    =  1

                                    ఫై సమీకరణాలు ​రెం​డింటిలోనూ ఏకత్వం ,ఒకటి( 1) ఉంది .కానీ రెండు ​ సమీకరణాలు ఒకలా లేవు .

భిన్నంగా ఉన్నాయి ​ అలాగే ఏ ఇద్దరి జీవితాలు ఒకలా ఉండవు . ఉదాహరణకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు.వీరిద్దరిలోను, ఫై సమీకరణాల్లో లాగే ఏకత్వం-మనోవాక్కయకర్మలలో ఏకత్వం ​-ఉంది . కానీ  ఇద్దరి   జీవితమార్గాలు  ఒకలాలేవు .  విలక్షణంగా ఉన్నాయి. కారణం వారు ఏకత్వానికి ,చిత్తశుద్దికి ప్రాధాన్యత యిచ్చి,అలావుండడానికి నిరంతర  సాధన  చెయ్యడం వల్ల ఆసాధన ఫలితం ఒక విలక్షణ జీవితవిధానంగా  దానంతట అదే రూపుదిద్దుకుంది .ఈ విలక్షణత అంతవరకు కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయాన్ని సమర్ధించవచ్చు ,లేదా వ్యతిరేకించవచ్చు . అలాకాకుండా ముందే ఏదో ఒక జీవితవిధానాన్ని ఆదర్శంగా పెట్టుకుని తదనుగుణంగా జీవించడం మొదలుపెడితే అది స్వభావానికి,పరిస్థితులకు విరుద్ధమై , మనోవాక్కయకర్మలలో  ఏక​త్వాన్ని (integrity)పోగొట్టి  అస్థిత్వాన్నే భంగపరుస్తుంది .అస్తిత్వంతో ఉండడమంటే ఏకత్వంతో ఉండడమే .


ఏకాకిజీవితం : ‘జగమంతకుటుంబం నాది ​​అనుకునేవాడికి ఏకాకిజీవితం తప్పదు . ఎందుకంటే అతడు  ఏ వర్గంలోను,వ్యవస్థలోను,వ్యక్తులతోను చేరడు . కాబట్టి అతడు ఏకాకి, సన్యాసి. ఎందులోనూ చేరడు కాబట్టే అందర్నీ కలుపుకుపోగలడు . అందువల్ల అతనిది జగమంతకుటుంబం ,సంసారసాగరం .


నేను (సృష్టికర్త ): సంక్షిప్త రూపం లో ఉన్న 1  విస్తృత రూపం దాల్చి  ​( X+1 ×  X-1)   అయినట్లు , సూక్ష్మరూపంలో వుండే విత్తనం స్థూలరూపం పొంది వృక్షం అవుతున్నట్టు ,ఏకాకిగా వున్న 'నేను' ఇంతితై వటుడింతయై అన్నట్టు విశ్వమంత అయ్యాను . ఏకాకియైన శ్రీకృష్ణుడు ,తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు .

                     ​ 1 ​లో ​ ( X+1 ×  X-1)వున్నట్టు ,విత్తనంలో వృక్షం దాగి వున్నట్టు , ఏకాకి లో విశ్వం ఇమిడి  వుంది . ఏకాకి ఐన శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు తనలోనే (నోట్లోనే ) విశ్వాన్ని చూపించాడు .

                            విశ్వం నాలో నుండే సృష్టి అవుతోంది(evaluation ) కనుక జగమంతకుటుంబం నాది . విశ్వం నాలో లీనం (లయం ) అయినపుడు నేను తప్ప ఎవరూ వుండరు కనుక ఏకాకిజీవితం నాది .

                            ఏకాకిగా వున్నసృష్టికర్త కవిగా ,కవితగా ,భార్యగా ,భర్తగా ............సృష్టిగా మారి జగమంత అయ్యాడు . మట్టి, కుండగా మారినట్టు సృష్టికర్తే సృష్టిగా మారాడు . మాధవుడే మానవుడయ్యాడు . నరనారాయణులు ఒక్కరే . నరుడే నారాయణుడు .

                        నరుడు ప్రేమికుడిగా,మానవుడిగా,భక్తుడిగా ఉన్నపుడు పాడుకోవడానికి  ప్రేమగీతాల్ని, భావగీతాల్ని,భక్తిగీతాల్ని ఇంతవరకు కవులందరూ వ్రాసారు . కానీ నరుడు నారాయణుడిగా వున్నపుడు పాడుకునే భగవద్ గీత శాస్త్రి గారి 'జగమంతకుటుంబం'

                            ఉన్నది ఒకటే నని ,రెండుగా కనిపిస్తున్నవన్నీ ఒకే దానికున్న రెండు పార్శ్వాలని  అద్వైతతత్వ సారాంశం . మనిషి ఏ పార్శ్వంలో ఉన్నా, జ్ఞాననేత్రంతో రెండో పార్శ్వం యొక్క ఉనికిని ,దాని విలువను గుర్తించగలడు .



Teluguseva

unread,
Apr 27, 2013, 9:26:14 AM4/27/13
to తెలుగు సేవ
శ్రీ భావరాజు గారికి నమస్కారములు,

మీరు చాలా బాగా సరళమైన తెలుగు వ్రాయగలరు.ఈ క్రింది వికిపెడియా
ఆంగ్లవ్యాసముని తెలుగులో అనువదించి తెలుగు వికిపెడియాలో
ప్రచురించవలసినదిగా కోరుచున్నాము.

http://en.wikipedia.org/wiki/Telugu_language_policy

తెలుగుసేవ


On Apr 24, 2:55 pm, bhavaraju <bhavara...@gmail.com> wrote:
> *

> జీవించడం మొదలుపెడితే అది స్వభావానికి,పరిస్థితులకు విరుద్ధమై ,మనోవాక్కయకర్మలలో  ఏక​త్వాన్ని

> *

Reply all
Reply to author
Forward
0 new messages