ఆకాశదేశాన ఆషాఢమాసాన...

32 views
Skip to first unread message

Sriram

unread,
Jul 16, 2007, 2:44:23 PM7/16/07
to sahityam
ఆషాఢమాసం ఇప్పుడే ప్రవేశించింది. బట్టలదుకాణాల వాళ్ళు బంపర్ డిస్కౌంట్
సేల్స్ మొదలుపెట్టేసారు అప్పుడే.

నాకుమాత్రం ఎందుకో కాళిదాసుని మేఘసందేశం గుర్తొచ్చింది. ఏదో కధగా వినడం
తప్పితే ఈ కావ్యాన్ని ఎప్పుడూ చదవలేదు. ఇందులోని మందాక్రాంత వృత్తాలు అతి
మనోహరంగా ఉంటాయని చెప్పగా విన్నాను. ఈ కావ్యానికీ, ఆషాఢానికీ ఏమైనా
సంబంధం ఉందా?

చదివిన వారూ, విజ్ఞులూ మనగుంపులో ఉన్నారని నమ్మకం. ఎవరైనా దయచేసి ఈ
కావ్యం విశేషాలు వివరిస్తే నాలాంటి వారికి చాలా మేలుచేసినవారౌతారు.

అన్నట్టు, ఈ కావ్యానికి తెలుగువ్యాఖ్యానం వావిళ్ళవారు కానీ లేక వేరెవరైనా
ప్రచురించారా?

padma i.

unread,
Jul 19, 2007, 2:50:51 AM7/19/07
to sahityam
కాళిదాసు మేఘదూతం ప్రశాంత గంభీరమైన ఒక ఖండకావ్యం. ఇది క్రీస్తు పూర్వం 1వ
శతాబ్దంలో రచించబడిందని అంటారు. ఇందులో కథ చాలా చిన్నది. మేఘదూతం
కావ్యంలో నాయకుడు ఒక యక్షుడు. కుబేరుడి కొలువులో పరిచారకుడు. ఒకసారి విధి
నిర్వహణలో ప్రమత్తుడై ఉన్నందువల్ల (అశ్రద్ధ వహించడం వల్ల) కుబేరుడి
కోపానికి గురి అవుతాడు. కుబేరుడు యక్షుడిని ఒక ఏడాది పాటు భార్యా
వియోగాన్ని పొందమని శపిస్తాడు. పాపం వేల్పులందరూ ప్రణయైక జీవులు కదా!
వాళ్లకి విరహం అతి దుర్భరమైనది. ఆ యక్షుడు కుబేరుడి శాపం వల్ల తన
మహిమలన్నీ కోల్పోయి చిత్రకూట పర్వతం మీద ఒక ఆశ్రమంలో గడుపుతూ, ఆషాఢ శుద్ధ
పాడ్యమి నాడు మేఘాన్ని చూస్తాడు. అలకా నగరంలో ఉన్న తన ప్రేయసికి ఆ మేఘుడి
ద్వారా సందేశాన్ని పంపడం మేఘ దూతంలో ఇతివృత్తం.

మేఘదూతం లో పూర్వమేఘమనీ, ఉత్తరమేఘమనీ రెండు భాగాలు ఉన్నాయి. పూర్వమేఘంలో
యక్షుడు తానున్న ప్రదేశం (ఇప్పటి నాగపూర్ దగ్గిర ఉన్న 'రామటేక్' అన్న
ప్రాంతం) నించి తన ప్రేయసి ఉండే అలకానగరానికి దారిని నిర్దేశిస్తాడు.
రెండవ భాగంలో అలకానగర వర్ణన, యక్షపత్ని నివాసం, ఆమె సౌందర్యం వగైరా
వర్ణించ బడ్డాయి.

మేఘదూతంలో ప్రకృతి వర్ణనలు, యక్షుని విరహోత్కంఠతలు అద్బుతంగా
వర్ణించబడ్డాయి. ఈ మేఘదూతానికి వ్యాఖ్యానాలు ఇప్పటిదాకా సంస్కృతంలో చాలా
వచ్చాయి(ట). తెలుగులో మహీధర నళినీమోహన్ రాసిన "మాత్రా ఛందస్సులో మేఘ
సందేశం" నేను కొన్నాళ్ల క్రితం విశాలాంధ్రలో (కాబోలు) కొన్నాను.

మేఘదూతా కావ్యానికి తెలుగులో అతి చక్కని, సరళమైన వ్యాఖ్యానం రాసింది
రామవరపు శరత్ బాబు, శోంఠి శారదాపూర్ణ గార్లు. వీళ్లిద్దరూ విశ్వనాథవారికి
శిష్య ప్రశిష్యులు, వరుసగా. ఈ పుస్తకంలో ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థ
తాత్పర్యాలే కాకుండా, పదచ్ఛేద, అన్వయాలు, "శ్రీకాళా" వ్యాఖ్య కూడా ఉంది.
ఆనందలహరి, విశాఖపట్టణం వారి ప్రచురణ. ఈ పుస్తకం నేను '98 లో అట్లాంటాలో
జరిగిన మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సులో కొన్న గుర్తు. విశాలాంధ్రలో
కూడా దొరకచ్చు.

ఇవీ మేఘదూతం విశేషాలు.

-- Padma I.
07/18/07

Sriram

unread,
Jul 19, 2007, 7:20:46 AM7/19/07
to sahityam
పద్మ గారూ, చాలా మంచి సమాచారం ఇచ్చారు. మీకు చాలా కృతజ్ఞతలు. క్లాసులో
సందేహం అడగడానికి ఎప్పుడూ సందేహించవద్దని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో
అర్ధమైంది. మీరు చెప్పిన వివరాలతో ఆన్లైన్ గ్రంధాలయంలో (http://
dli.iiit.ac.in) వెతికితే శరత్బాబుగారి పుస్తకం దొరికేసింది (http://
dli.iiit.ac.in/cgi-bin/Browse/scripts/use_scripts/advnew/aui/
bookreader_india/1.cgi?barcode=2020010024686 ).

నాబోటి వాళ్ళకి అర్ధమయ్యేలా చక్కగా గురుముఖతః చెప్పుకున్న రీతిలో
చదువుకునేలా ఉంది ఈ పుస్తకం. ఇంతమంచి వివరాలు అందజేసినందుకు మరోసారి
కృతజ్ఞతలు.

> > ప్రచురించారా?- Hide quoted text -
>
> - Show quoted text -

Reply all
Reply to author
Forward
0 new messages