తెలుగులో కథలు చాలా ఎక్కువగానే ఉన్నాయి, అందులోనూ, ప్రపంచ సాహిత్యానికి ఏ
మాత్రం తీసిపోని గొప్ప కథకులు మనకి చాలా మందే ఉన్నారు. కథకున్నంత స్థాయి
తెలుగులో నవలలకుందంటారా?
మనకి గొప్ప నవలలు - పది కాలాలు పాటు నిలిచేవి ఎన్ని ఉన్నాయి?
తెలుగు సాహితీప్రియులందరూ చదివి తీరాల్సిన నవలలు పట్టి ఒకటి తయారు
చేద్దామా?
నాకు గుర్తున్నవి కొన్ని:
వీరేశలింగం - రాజశేఖర చరిత్ర
విశ్వనాధ - వేయిపడగలు
తాపీ ధర్మారావు - ??
అడివి బాపిరాజు - నారాయణరావు
తెన్నేటి సూరి - ఛెంఘీజ్ఖాన్
బుచ్చిబాబు - చివరకు మిగిలేది
గోపిచంద్ - అసమర్ధుని జీవయాత్ర, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా
మహీధర రామమోహనరావు - కొల్లాయి గట్టితేనేమి
దాసరధి రంగాచార్య - మాలపల్లి (?)
రంగనాయకమ్మ - బలిపీఠం, స్వీట్హోం (?)
కుటుంబరావు: చదువు
వడ్డెర చండీదాస్: హిమజ్వాల
నోరి నరసింహశాస్త్రి: నారయణభట్టు, తిక్కనమీద, ఎర్రాప్రగెడ మీద రాసిన నవలల
పేర్లు గుర్తులేవు, ధూర్జటి, కవిద్వయము
చలం: మైదానం
ఇంకా...???
యండమూరి, యద్దనపూడి, మాదిరెడ్డి, మల్లాది, ఆనందారామం, వాసిరెడ్డి
సీతాదేవి, బీనాదేవి - వీరందరికీ క్లాసికల్ స్టేటస్ ఇవ్వొచ్చా?
అడగండి మేషారూ, ఓ రెండురోజులు పెద్దగా పనేం లేదు. మీతో ముచ్చట్లకంటే
కోరేదేం ఉంటుంది?
నాకు తెలిసినవైతే తప్పకుండా చెప్తాను, తెలియనవైతే తెలిసినవాళ్ళనడిగి
తెలుసుకొందాం..
యద్దనపూడి వి కొన్ని చాన్నాళ్ళ క్రితం చదివా కానీ అంత గుర్తుండిపోయేలా
ఏమీ అనిపించలేదు.
ఇప్పుడు చదివితే ఏమైన తెలియొచ్చేమో.
రంగనాయకమ్మ గారి స్వీట్ హోం చాలా బాగుంటుంది ముఖ్యం గా అనుదులోని హాస్యం,
సున్నితత్వం.
మైదానం గురించి మాట్లాడితే ఎన్నో విషయాలు మాట్లాడాల్సొస్తుందేమో.
అది నిజం గా చదవవలసిన పుస్తకమా కాదా అంటే చెప్పటానికి నా ఆలోచనా పరిధి చాలదేమో.
ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటో ఎవరైనా చెప్తే తెలుసుకోవాలని ఎప్పట్నుంచో
అనుకుంటున్నాను.
ప్రస్తుతానికింతే.
--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.
మీరు ఉటంకించిన ఇంటి పేరున్న వారందరూ - పూసపాటి, ఉప్పలపాటి, కాకర్లపాటి -
మొదలైన ఇంటిపేర్ల వారందరూ - రాజులు, వెలమ దొరలే. విజయనగరం రాజుల ఇంటిపేరు
పూసపాటే కదా?
విజయనగరం వైపు ఒక పద్ధెనిమిది ద్రావిడ బ్రాహ్మణ కుటుంబాలు వలస వచ్చేయి.
వీళ్ళంతా మొదట తంజావూరు ప్రాంతం వాళ్ళు, ముందుగా తూర్పుగోదావరి, అమలాపురం
మండలంలో స్థిరపడ్డారు - అక్కడనుంచి కొంతమంది విజయనగరం వలస వచ్చేరట.
ద్రావిడులు మాట్లాడుకొనే భాష గురజాడ కన్యాశుల్కంలో వాడిన భషే. అన్నని ఆచ
అని, తమ్ముడిని తంబి అని పిలుస్తారు. వచ్చేవుషే, ఉన్నాయిష లాటి మాటలు,
పింజారి ము- - లాటి తిట్లు వాడతారు. ఇప్పుడు లేవనుకోండి - కాని నా
చిన్నప్పుడు నేనిలాటి మాటలు విన్నాను. అజ్జాడ, లోగీస, వెదురుపర్తి,
కసింకోట, కలవరాయి లాటి అగ్రహారాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు.
గ్రామాల్లో రాజులు, వెలమదొరలు మాట్లాడే భాష మీరన్నట్టే ఉంటుంది -
బారెకాడు, దేవిడీ మున్నా లాటి మాటలు వాడుకలో ఉన్న మాటలే.
వెలమదొరలకి పౌరషానికేం తక్కువలేదు. మన సినిమాల్లో చూపించే సీమ రెడ్లకేం
తీసిపోరు. అయితే, జమీందారి రద్దు చట్టాలు వచ్చేక, చాలా మంది భూములు,
పుట్రలు కోల్పోయి, నడ్డి విరిగి - పూర్వ వైభవాన్ని కోల్పోయేరు. ఇప్పటికీ
బాగా మోతుబరి వెలమలు చాలా రాజసంగానే ఉంటారు. కొంతమంది అటుపక్కనుంచి
వచ్చిన రాజకీయ నాయకులు వెలమ దొరలే. ఇంట్లో ఘోషా ఎక్కువే. పిల్లలని తండ్రి
కూడా 'మీరు' అని పిలవడం లాటి ఆచారాలున్నాయి. ఇప్పుడు వ్యాపారాల్లోకి
వచ్చేక బాగా మారిపోయింది.
చితికిపోయిన వాళ్ళు - పాపం చాలా దీనావస్థలో ఉంటారు. ఒకప్పుడు బాగా
బతికి, జమీందారీలు, కొలువులు పోయేక చతికిలపడ్డ వంశాలు, కుటుంబాలు
అన్నిచోట్లా ఉన్నాయి కదా? తూర్పుగోదావరిలో సేనాపతుల కథ సుమారుగా ఇలాటిదే
అనుకొంటాను. ఉన్నదంతా పూర్తిగా తుడుచుపెట్టుకుపోయి - జీవచ్చవాలగా
బతుకులీడుస్తున్నవాళ్ళు ఎందరో.