పెద్దలార, మిత్రులార,
నమస్కారం. నాదొక సందేహం. హైస్కూలు చదువుల్లో ఒక పాఠంలో - దుఃఖభాజనులు అని ఎవరిని అంటారో చెబుతూ - నిత్యశంకితుడు, నిస్సంతోషి, క్రోధనుడు ... ఇంకా ఏవో కొన్ని పదాలు వుండేవి. అవేమిటో ఎవరికైనా గుర్తుందేమో చెబుతారని అడుగుతున్నాను. పావురాల గుంపొకటి తమలోని అనుభవజ్ఞుని మాట వినకుండా వేటగాని వలలో చిక్కిన కథలో అనుకుంటాను. ఈ అడవిలో నూకలు వెదజల్లబడి వున్నాయంటే ఇది శంకించాల్సిన విషయమే అని ఒక ముసలి పావురం అన్నప్పుడు దాన్ని ఈ దుఃఖభాజనుల జాబితాలో చేర్చుతూ మరో పావురం చెప్పే మాట - (సరిగా గుర్తులేదు). వలలో చిక్కిన తరువాత అన్నీ కూడబలుక్కొని వలతో సహా ఎగిరిపోతాయి (పంచతంత్రం - మిత్రలాభం), అది వేరే సంగతి. ఇంతకీ దుఃఖభాజనులు ఎవరు?
భవదీయుడు,
-- రానారె
~ ~ ~