పంచ + ఉపనిషత్ + మయమగు దేహము = పంచభూతములతో నిర్మితమైనది
పోతన తెలుగు భాగవతంలో కింది పద్యంలో బంచోపనిషణ్మయ మగు దివ్యదేహంబు అని ప్రయోగించిన పదానికి వివరణాత్మక అర్థం అర్థిస్తున్నాను. సహృదయులు సాహితీప్రియులు తప్పక అందిస్తారని ఎదురు చూస్తున్నాను.
3-173-సీ.
నావుడు రాజేంద్రునకు శుకయోగీంద్రుఁ 1
డిట్లను “మున్ను లోకేశుచేత 2
సంప్రార్థితుండైన జలరుహనాభుండు 3
వసుమతిపై యదు వంశ మందు 4
నుదయించి తనుఁ దాన మదిలోనఁ జింతించి 5
తెలివొంది యాత్మీయ కుల వినాశ 6
మొనరించి తాను బంచోపనిషణ్మయ 7
మగు దివ్యదేహంబు నందుఁ జెందఁ 8
దలఁచి విఙ్ఞానతత్త్వంబున ధరణిమీఁద 9
దాల్చి జనకోటి కెఱిఁగింపఁ దగిన ధీరుఁ 10
డుద్ధవుఁడు దక్క నితరు లేనోప రితండు 11
నిర్జితేంద్రియుఁ డాత్మ సన్నిభుఁ డ టంచు. 12
--
---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
1-పరమేష్టి
2-పుమాన్
3-విశ్వ
4-నివృత్తి
5-సర్వ
జీవునికి ముక్తి లభించిన తరువాత ఈ పాంచ భౌతిక శరీరం విడిపోయి, వైకుంఠ ప్రవేశం చేయగానే పంచోపనిషన్మయ దివ్య మంగళ విగ్రహం వస్తుంది.
On Wednesday, 3 April 2013 05:51:44 UTC+3, bhagavatha ganandhyayi wrote:
> భాగవతులకు ప్రణామములు,
> పంచోపనిషణ్మయదేహము అంటే అయిదు ఉపనిషత్తులతో కూడిన దేహము అని మహాపండితులు శ్రీ ఆశావాది ప్రకాశ రావుగారు తితిదే ప్రచురణ పోతన భాగవతము తృతీయ స్కంధంలో ఉల్లేఖించారు. మరి ఐదు ఉపనిషత్తులు గ్రంథాలా? ధర్మాలా? మరొకటా? అవి ఏవి? అన్న వివరణ కోసం అర్ధిస్తున్నాను. ఈ విషయం నన్ను ఎందుకో వదలటం లేదు. క్షమించండి. ఒక సందర్భంలో ఆ మహానుభావుని దర్శించ గలిగినా అడగాలన్న ధ్యాస లేకపోయింది. దయచేసి ఎవరైనా సాయండి.