అక్షరం లోక రక్షకం
సరసభారతి195వ కార్యక్రమ౦గా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు
సరస భారతి ,స్థానిక శాఖా గ్రంథాలయం (ఎ..సి. లైబ్రరి –ఉయ్యూరు సెంటర్ కు దగ్గరలోఉన్న పశువుల ఆస్పత్రి దగ్గర ) ,జాగృతిపొదుపు సహకార సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో
సరసభారతి195వ కార్యక్రమ౦గా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదివేడుకలు15-3-2026ఆదివారం సాయంత్రం 4 గం .లకు శ్రీ మైనేని వెంకటనరసయ్య శ్రీమతి సౌభాగ్యమ్మ గార్ల స్మారక శాఖా గ్రంథాలయం( ఎ..సి.లైబ్రరి ) లోని-’
’శ్రీ మైనేని గోపాలకృష్ణ సభా వేదిక’’పై నిర్వహించ బడుతాయి ..
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభం –శ్రీమతి జోశ్యుల శ్యామlలాదేవి ,సరసభారతి గౌరవాధ్యక్షులు
సభ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి – సరసభారతి కార్యదర్శి .
ముఖ్య అతిధి – శ్రీ వై .వి. బి .రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి మాజీ సభ్యులు –ఉయ్యూరు
గౌరవ అతిధి –డా.శ్రీ చుండూరు మాణిక్య రావు , ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ అండ్ కోఆర్డినేషన్ –ఆకాశవాణి –విజయవాడ
ఆత్మీయ అతిధులు -
శ్రీ గుత్తికొండ సుబ్బారావు –అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం –మచిలీ పట్నం
డా.జి వి .పూర్ణచంద్-ప్రధాన కార్యదర్శి , కృష్ణా జిల్లా రచయితల సంఘం – విజయవాడ
డా.మైలవరపు లలిత కుమారి –గుంటూరు
డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య –నెల్లూరు
శ్రీ దండిభొట్ల దత్తాత్రేయ శర్మ – విజయవాడ
కార్యక్రమం
మధ్యాహ్నం -3-30 కు అల్పాహారం
సాయంత్రం 4గం .నుండి 5-30గం .లవరకు –కవి సమ్మేళనం
జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకొంటున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు రచయితల సంఘం కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు ,నిత్యసాహితీ కృషీవలురు శ్రీ చలపాక ప్రకాష్ గారి సాహితీ సేవలకు సార్ధకం గా, ఉగాది సందర్భం గా ‘’’’ నిత్య సాహితీ వసంత ‘’ప్రకాశం ‘’‘’శీర్షిక తో ప్రముఖ కవులచేత’’ కవిసమ్మేళనం ‘’
నిర్వహణ -’ శ్రీ చెన్నాప్రగడ శర్మ ఆధ్వర్యం లో ,శ్రీ పాణిగ్రాహి రాజశేఖర్ ,శ్రీమతి కొమాండూరి కృష్ణా ,శ్రీమతి ముదిగొండ బాలకాత్యాయిని గార్ల సహకారంతో , నిర్వహింపబడుతుంది .
గమనిక - పద్యకవిత -5పద్యాలు ,వచనకవిత -15పంక్తులకు పరిమితం .కవిత చదవగానే కాపీ నిర్వాహులకు అందజేయటం మరువవద్దు.
సాయంత్రం 5-30నుంచి -7 గం.లవరకు –శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార ప్రదానం ,పురస్కార గ్రహీతల స్పందన
జీవన సాఫల్య పురస్కార ప్రదానం
1-ప్రదాతలు -
సరసభారతి అందిస్తున్న సరసభారతికి అత్యంత ఆప్త్తులు ,తమతలిదండ్రుల పేరిట ‘’దక్షిణా భారత దేశం లోనే తొలి ఏ.సీ .గ్రంధాలయ’’ నిర్మాణానికి భూరి విరాళం అందించిన వితరణ శీలి ,ఉయ్యూరు గ్రామస్తులు ,అమెరికా నివాసి స్వర్గీయ మైనేని గోపాల కృష్ణ(అమెరికా ) గారి స్మారక జీవన సాఫల్య పురస్కార౦
గ్రహీత-
శ్రీ చలపాక ప్రకాష్ -.ఆంధ్రప్రదేశ్ తెలుగు రచయితల సంఘం కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు ,నిత్యసాహితీ కృషీవలురు –విజయవాడ
2-ప్రదాతలు -
సరసభారతి కి ఆత్మీయులు ,పీరియాడిక్ టేబుల్ లో 117వ మూలక౦ (టెన్నిస్సిన్Ts )కనిపెట్టిన అంధ్ర న్యూక్లియర్ సైంటిస్ట్ డా.ఆకునూరి వెంకటరామయ్య గారి స్మారక’’ జీవన సాఫల్య పురస్కారం ‘’ రామయ్యగారి సతీమణి శ్రీమతి కృష్ణ మయి,మరియు కుటుంబ సభ్యులు (అమెరికా
గ్రహీత -
డా.మక్కెన శ్రీను –కవి,కథా రచయిత, విమర్శకులు -అసోసియేట్ డీన్- పశు వైద్య కళాశాల-,గరివిడి (విజయనగరం జిల్లా
కీ.శే గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీమతి భవానమ్మ గార్ల స్మారక శ్రీ పరాభవ ఉగాది పురస్కారాలు అందుకొనువారు -
1- శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి –అవధాని ,లేఖినీ సామ్రాజ్ఞి ,నవనవోన్మేషకవితా ధిషణాలంకృతీ,తెలుగు,సంస్కృతం లలో ఎం. ఎ.,కృష్ణభక్తి పద్యకవయిత్రి ,రాధికోదాహరణ కావ్యం ,శతవిధ వృత్తాలతో పద్య , ,శతకరచన ,శ్రీ గోదా సేవాసంస్థ ద్వారా 300కుపైగా అష్టావధాన నిర్వహణచేసిన విదుషీమణి –హైదరాబాద్ .
2- శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వర రావు .వాగ్భూషణ్, అవధాన కళాధర, గీతావధానాదిత్య ,ఎం.ఎ..సంస్కృత వ్యాకరణ అధ్యాయి , 22అష్టావధానాలు ,40 గీతావధానాలు చేసిన అవధాని ––తిరుపతి .
3- శ్రీ రహ్మనుద్దీన్ షేక్—కంప్యూటర్ తెలుగు సాంకేతిక నిపుణులు –హైదరాబాద్
4- శ్రీ అక్కల రామ కృష్ణారావు – ప్రముఖ అంతర్జాతీయ శిల్పాచార్యులు , ,చిత్రకారులు –తెనాలి
5- శ్రీమతి జంధ్యాల కుసుమకుమారి –పంచ సహస్రావధాని కీ.శే .జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమార్తె ,విశ్రాంత సంయుక్త కార్యదర్శి ,సచివాలయం –హైదరాబాద్ .
-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతుల శ్రీ పరాభవ ఉగాది పురస్కారాలు అందుకొను వారు –
1- శ్రీ వేంపల్లి షరీఫ్ – కేంద్ర సాహిత్య అకాడెమి యువ సాహితీ పురస్కార గ్రహీత–విజయవాడ
2- శ్రీ శ్రీకంఠ స్పూర్తి -ప్రముఖ కవి ,కథారచయిత,రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మక ,భాషా సాంస్కృతిక శాఖ విశ్వావసు పురస్కార గ్రహీత ,ఎక్స్ రే జాతీయ ఉత్తమకవితా పురస్కార గ్రహీత ––విజయవాడ
3- శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు –.అభినవ వేమన ,,శతకరత్న ,కవిమిత్ర,సాహితీ ప్రవీణ – –దామల చెరువు ,చిత్తూరు జిల్లా .
4- శ్రీమతి పాలపర్తి హవీలా- ఖండకావ్య,శతక, బాల గేయాల కవయిత్రి, భారతి జాతీయ పద్యకవితా పురస్కార గ్రహీత ––ఖమ్మం
5- శ్రీమతి శరకణ౦ కనకదుర్గ - .సాహితీ ప్రజ్ఞాస్పూర్తి చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ఉత్తమ ఉపాధ్యాయురాలు కథా,నవలా కవితా రచయిత్రి ,NLCP బ్రిడ్జిస్కూల్ ప్రిన్సిపాల్ -, - గుంటూరు .
6- చదలవాడ సిస్టర్స్ (ద్వారకాజయలక్ష్మి ,నాద పద్మ )- కూచిపూడి నాట్యం లో బి గ్రేడ్ ఆర్టిస్ట్స్,స్నాతకోత్తర విద్య నభ్యసిస్తూ ,అన్నమయ్య కీర్తనలకు
అద్భుత నృత్యం చేసే యువ కళాకారిణులు – -విజయవాడ
-7-డా .పెరుగు రామ కృష్ణ – రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జీ.ఎస్. టి. అధికారి , అయిదు దశాబ్దాల సాహితీ కృషీవలుడు,,ఫ్లెమింగో వలసపక్షులపై దీర్ఘ కవిత రాసి ,పలుదేశాలఅంతర్జాతీయ వేదికలపై తెలుగు ఘనత చాటినకవి , ఎన్నో రచనలు ప్రపంచ భాషలలోకి అనువదింపబడి, విశ్వ విఖ్యాత కీర్తి పొందిన, తొలి తెలుగు సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత ,భారత్ భాషా భూషణ్ ,జాతీయ రాష్ట్ర భాషా గౌరవ సమ్మాన్ –నెల్లూరు .
8- కీ.శే .శ్రీ గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మ ,శ్రీమతి కమలమ్మ గార్ల స్మారక శ్రీ పరాభవ ఉగాది పురస్కారం
ప్రదాత –శ్రీ గబ్బిట రామనాథబాబు
గ్రహీత
శ్రీ బంకుపల్లి వేంకట విద్యాసాగర్ -సంగీత ఎం.ఎ., లలిత సంగీత Aగ్రేడ్ ,కర్ణాటక, భక్తి సంగీత విభాగ B హైగ్రేడ్ ఆర్టిస్ట్ ,నాటకనటుడు ,సంస్కారభారతి సుమధుర కళానికేతన్ పురస్కార గ్రహీత ,ట్రిపుల్ ఐ. ఐ.టి .సంగీత అధ్యాపకులు ––నూజివీడు
9-స్వర్గీయ వేలూరి రామకృష్ణ శ్రీమతి వేదవల్లి దంపతుల స్మారక శ్రీ పరాభవ ఉగాది పురస్కారం
ప్రదాతలు-కుమారులు –చి .వేలూరి రవి కిరణ్ (హైదరాబాద్ ),చి వేలూరి హరికిషన్(అమెరికా ) సోదరులు
గ్రహీత
శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి –,సకల కళా మూర్తి ,మానవతావాది ,సాహిత్యంద్వారా సమాజ చైతన్యాన్ని కలిగిస్తున్న ఆదర్శ తెలుగు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ –గుంటూరు.
శ్రీ పరాభవ ఉగాది ప్రత్యేక పండిత పురస్కార ప్రదానం –
ప్రదాతలు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,శ్రీ నాగేశ్వరరావు దంపతులు
గ్రహీత –డా.పి టి.జి.వి.రంగాచార్యులు –తెలుగు సంస్కృత జ్యోతిష ఫిలాసఫీ ఎం.ఎ .విశిష్టాద్వైత ఆచార్య ,శిక్షా శాస్త్రి,రిటైర్డ్ సంస్కృత లెక్చరర్ ,మహారాజా కాలేజి ,విజయనగరం ,బహు సుప్రభాత శతక, కర్త ,భారత రాష్ట్రపతి పురస్కార గ్రహీత ,సంస్కృత కళాపూర్ణ ,కాళిదాస ప్రతిస్పర్ధీ ,మహోపాధ్యాయ – శ్రీరంగపురం –కృష్ణా జిల్లా
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,ప్రభావతి దంపతుల శ్రీ పరాభవ ఉగాది ‘’స్వయం సిద్ధ పురస్కారాలు’’ అందుకొనే వారు
1- చి .సూరి శ్రీనివాస్ ,శ్రీమతి లలిత దంపతులు – శిష్యులు ,ఎల్. ఐ. సి. ఏజెంట్స్, ,సాంఘిక సేవాపరాయణులు –రాజమండ్రి
2- శ్రీమతి లావేటి శ్రీలక్ష్మి –మెషిన్ కుడుతూ చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబ పోషణ చేసుకొంటూ ,ఇద్దరు కుమారులను ఇంజనీరింగ్ ,ఇంటర్ చదివి౦చు కొంటున్న మహిళ –ఉయ్యూరు .
3- శ్రీ అబ్దుల్ అన్సారి -50 ఏళ్ళుగా టైలరింగ్ మాస్టర్ –ఉయ్యూరు .
సరసభారతి శ్రీ పరాభవ ఉత్తమ సేవా పురస్కార గ్రహీతలు
1- చి –చౌడాడ చిన అప్పలనాయుడు- నిజాయితీకి మారుపేరు ,సేవకు హనుమాన్- -ఉయ్యూరు
2- చి.శీను –ఫోన్ చేస్తే క్షణాలమీద వచ్చిపని చేసే హ్యాండ్ పంప్ మెకానిక్ ,ప్లంబర్ –ఉయ్యూరు .
3- శ్రీమతి నగిరెడ్డి నాగ లక్ష్మి – కంప్యూటర్ తో పోటీ పడి పనిచేసే ఉద్యోగిని ,జాగృతి పొదుపు సహకార సంస్థ –ఉయ్యూరు
4- శ్రీమతి పాండి శివ గంగ - కాల్క్యులేటర్ తో సమానంగా ఖచ్చితంగా లెక్కలు తేల్చే ఉద్యోగిని,జాగృతి పొదుపు సహకార సంస్థ –ఉయ్యూరు
ఈ కార్యక్రమానికి సాహిత్య ,సంగీత, నాట్యాభిరుచి కలవారందరినీ ఉగాది శుభా కాంక్షలతో ఆహ్వానిస్తున్నాం .పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన.
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
ఆహ్వాని౦చు వారు
శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు ,శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి-కార్యదర్శి , శ్రీ గబ్బిట వెంకటరమణ –కోశాధికారి
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ -.సరసభారతి అధ్యక్షులు
శాఖా గ్రంధాలయం ,జాగృతి పొదుపు సహకార సంఘం –ఉయ్యూరు
సరసభారతి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం, లో పాల్గొను కవి మిత్రులు
1. శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి 2-శ్రీ గొల్లపూడి గిరి భూషణరావు 3-శ్రీ వశిష్ట సోమేపల్లి 4-శ్రీ ఎస్.ఎం.సుబాని 5-శ్రీ ,నానా 6-శ్రీ మోదుగురి శేషాచారి 7-శ్రీ బొమ్ము ఉమా మహేశ్వర రెడ్డి (గుంటూరు)8-శ్రీఆళ్ల నాగేశ్వరరావు (తెనాలి) 9-శ్రీమతి చింతా లక్ష్మీ సుజాత (మైలవరం) 10-డాక్టర్ పూర్ణ ప్రజ్ఞాచారి (నూతక్కి) 11-శ్రీ కొగిలి రాజశేఖర్ (తాడేపల్లి) 12-,శ్రీమతి సింహాద్రి పద్మ (అవనిగడ్డ )13-,శ్రీమతి పుట్టి నాగలక్ష్మి (గుడివాడ)14-శ్రీమతి కోపూరి పుష్పాదేవి,15-శ్రీమతి సింహాద్రి వాణి ,16-శ్రీమతి సామినేని శైలజ 17-శ్రీమతి వేలూరి సుధారాణి ,18-శ్రీమతి పల్లావఝుల వెంకటశైలజ,19- శ్రీమతి విజయశ్రీ దుర్గ . 20-శ్రీమతి వి శ్రీఉమా మహేశ్వరి 21-శ్రీమతి మందరపు హైమవతి,22-శ్రీమతి ,వైష్ణవి, 23-శ్రీమతి కప్పగంతు అమూల్య చందు,24-శ్రీమతి మాచిరాజు మీనాకుమారి,25-శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర26- శ్రీమతి ఎస్.అన్నపూర్ణ ,27--శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు28- శ్రీ పొన్నాడ సత్యప్రకాశరావు . 29--శ్రీ కందికొండ రవికిరణ్ . 30-శ్రీ కె.ఆంజనేయకుమార్ 31--శ్రీ చిత్రాడ కిషోర్కుమార్, 32--శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావు . 33--శ్రీపంతుల వెంకటేశ్వరరావు 34-.శ్రీ టి.రవీంద్ర,35- శ్రీదండిభొట్ల దత్తాత్రేయ శర్మ . 36-శ్రీకె.ఈశ్వరరావు (విజయవాడ)37- డా.బిహెచ్ వి రమాదేవి (రాజమండ్రి)
గబ్బిట దుర్గాప్రసాద్ -27-2-26-ఉయ్యూరు