కర్నాటక లో బత్తాయి పళ్ళు అమ్ముతూ విద్యలేని తనలాంటి వారికోసం ప్రాధమిక పాఠశాల,,హైస్కూల్ స్థాపించి ,ప్రీ యుని వర్సిటి లక్ష్యంగా కృషి చేసిన –పద్మశ్రీ హరేకల హజబ్బ
చదువుకోని వారికే అక్షరం విలువ తెలుస్తుందంటారు.ఆ విలువ తెలిసిన వాడు కాబట్టే ఎంతో మందికి అక్షరదానం చేస్తున్నాడు.వీధుల్లో పండ్లు అమ్మితే వచ్చే సంపాదనతో పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన హజబ్బ సేవా గుణాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ తో సత్కరించింది.
కర్ణాటక రాష్ట్రం మంగుళూరు తాలుకా న్యూపడపు గ్రామానికి చెందిన హరేకల హజబ్బా(Harekala Hajabba) నిరక్షరాస్యుడు.స్థానికంగా బత్తాయి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.
హరేకల హజబ్బ స్థానికంగా ఉన్న సెంట్రల్ మార్కెట్లో కమలాలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.ఈ క్రమంలో ఓ రోజు ఫారిన్ దంపతులు హజబ్బ దగ్గరకు వచ్చి కిలో కమలాలు ఎంత అని ఇంగ్లీష్లో అడిగారు.హజబ్బకు కన్నడ, మాతృభాష అరబ్బీ తప్ప మరో భాష రాదు. అందుకే ఆ ఫారిన్ దంపతులు అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు.ఆ దంపతులు హజబ్బను చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు.జరిగిన అవమానం హజబ్బను చాలా కుంగదీసింది.తన పరిస్థితి మరేవరికి రాకూడదనుకున్నాడు.
ఇంగ్లీష్ రాకపోవడం వల్లే తాను ఇలా అవమానాలు పొందాల్సి వచ్చిందని భావించాడు.తన గ్రామంలోని పిల్లలు ఎవరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొకుండా ఉండాలంటే వారికి ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలని భావించాడు.కానీ తన గ్రామంలో మంచి స్కూల్ లేకపోవడం మదర్సాలో అరబ్బీ తప్ప మరో భాష నేర్పకపోవడం హజబ్బను కలవరపరిచింది.ఈ క్రమంలో హజబ్బ తానే స్వయంగా ఓ పాఠశాలను ప్రారంభించాలిన నిర్ణయించుకున్నాడు.అయితే అది అనుకున్నంత సులభంగా జరగలేదు.ఎన్నో అవమానాలు అడ్డంకులు ఎదురుకున్నాడు. వాటన్నింటిని దాటుకుని 1999, జూన్లో తన కలని నిజం చేసుకున్నాడు. అప్పటి వరకు తాను పొదుపు చేసుకున్న ఐదువేల రూపాయలతో సొంతంగా కొంత భూమి కొనుగోలు చేసి పాఠశాల నిర్మాణం ప్రారంభించాడు.
ప్రభుత్వం, దాతల సాయంతో అలా 2001 జూన్ నాటికి 8 తరగతి గదులు, రెండు మరుగుదొడ్లతో స్కూలు నిర్మాణం పూర్తయింది. అయితే పాఠశాల నిర్మించాలనే అతని కల నెరవేరింది.ఆ తర్వాత హైస్కూలు స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. పదేళ్లు కష్టపడి దాన్ని కూడా సాకారం చేసుకున్నాడు.2012 నాటికి ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత తరగతి విద్యార్థుల కోసం మరో బిల్డింగ్ నిర్మించాడు.
భవిష్యత్ పిల్లల కోసం మరిన్ని విద్యాసంస్థలు నిర్మించి గ్రామంలో ఫ్రీ యూనివర్సిటీ కళాశాలను నిర్మించాలన్నదే హజబ్బ అంతిమ లక్ష్యం.
నిరక్షరాస్యుడైన హాజబ్బ బుట్టలో పండ్లమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో బడిని కట్టించారు.తనలా నేటి తరం పిల్లలు చదువుకు దూరం కావొద్దనే ఆయన ఆశయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
--
You received this message because you are subscribed to the Google Groups "సరసభారతి సాహితీ బంధు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z_s%3DhE0eZ1a%3D6Zi34vDh9pffupORRo4BUgOhZ7y8CBShA%40mail.gmail.com.