భర్తృహరి సుభాషితాలు లో భర్తృహరి చెప్పినట్లు “దాతృత్వం కలిగినవారు మాత్రమే దానం చేయగలరు”
షిర్డి పుణ్య క్షేత్రంలో “శ్రీ సాయిరమ్య చారిటబుల్ ట్రస్ట్” వారి అన్నదానం
భారతదేశంలోని ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలలో షిర్డీ క్షేత్రం ఒకటి. శ్రీరామ, దత్తాత్రేయ కలియుగ అవతారపురుషుడే శ్రీ షిర్డి సాయినాథుడు. ఆయనను నమ్మి ప్రార్ధించు వారిని సకల వేళలా వెన్నంటి ఉండే ఇలవేలుపు శ్రీ సాయిబాబా.
అన్నిదానాలలోకి అన్నదానం శ్రేష్టం పరమ పవిత్రం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని సకల వేదాలు, ఉపనిషత్తులు గ్రంధాలు భోదిస్తున్నాయి. శ్రీ సాయినాధులు “సైతం దండం పెట్టె చేయి కన్నా దానం చేసే చేయి మిన్న” అని ప్రభోధించారు. అన్నదానం చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అటువంటిది దివ్య క్షేత్రాలలో అన్నదానం చేయడం మరింత పుణ్య ఫలప్రదం అన్నదానం చేయడం వలన శ్రీ షిర్డి సాయినాథుని కరుణా కటాక్షాలతో మీకు మీ కుటుంబానికి నిత్య సుఖ శాంతులు, భోగభాగ్యాలు సంప్రాప్తించగలవు.
కావున సమర్ధ సద్గురువు సాయినాధులు సశరీరంతో నడయాడిన షిర్డి పుణ్య క్షేత్రంలో, సమాధి మందిరానికి అతి సమీపంలో మాతో నిర్వహించబడుచున్న “శ్రీ సాయిరమ్య చారిటబుల్ ట్రస్ట్” సభ్యులుగా చేరి మా ద్వారా ప్రతినిత్యం జరుపుతున్న అన్నదానం కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరి ప్రార్థించుచున్నాము.
శాశ్వత అన్నదాన ప్రసాదసేవ వివరాలు
రూ. 50,616 లు అందజేసిన దాతను మహారాజ పోషకులుగా గౌరవించి వారికి గాని వారిచే అనుమతి పొందిన వారికి గాని సంవత్సరములో మూడు పర్యాయములు వరుసగా నాలుగు రోజులపాటు ఉచితముగా వసతి మరియు వారు కోరిన వారి పేరుమీద కోరిన 12 రోజులలో అన్నదానం చేయబడును. మహారాజ పోషకుని ఫోటో అన్నదానం జరుపు హాలులో అలంకరించబడును.
రూ. 25,416 లు అందజేసిన దాతను రాజ పోషకులుగా గౌరవించి వారికి గాని వారిచే అనుమతి పొందిన వారికి గాని సంవత్సరములో రెండు పర్యాయములు వరుసగా మూడు రోజులపాటు ఉచితముగా వసతి మరియు వారు కోరిన వారి పేరుమీద కోరిన 6 రోజులలో అన్నదానం చేయబడును. రాజ పోషకుని ఫోటో అన్నదానం జరుపు హాలులో అలంకరించబడును.
రూ. 10,116 లు అందజేసిన దాతను క్రియాశీల పోషకులుగా గౌరవించి వారికి గాని వారిచే అనుమతి పొందిన వారికి గాని సంవత్సరములో రెండు రోజులపాటు ఉచితముగా వసతి మరియు వారు కోరిన వారి పేరుమీద కోరిన 2 రోజులు అన్నదానం చేయబడును. వారి ఫోటో అన్నదానం జరుపు హాలులో అలంకరించబడును.
రూ. 5,116 లు అందజేసిన దాతను శాశ్వత సభ్యునిగా గౌరవించి వారికి గాని వారిచే అనుమతి పొందిన వారికి గాని సంవత్సరములో ఒక రోజు ఉచితముగా వసతి మరియు వారు కోరిన వారి పేరుమీద కోరిన రోజు అన్నదానం చేయబడును.
ముఖ్య గమనిక: షిర్డిలో జరుగు పర్వదినములైన శ్రీరామనవమి, గురుపౌర్ణమి, శ్రీ సాయి పుణ్యతిధి (బాబా సమాధి చెందిన రోజు), విజయ దశమి మరియు జనవరి 1వ తేదీలలో వసతి సౌకర్యం లభించదు.
మిగిలిన ముఖ్య పర్వదినములలో వచ్చు భక్తులు గాని లేక మిగిలిన రోజులలో రాగోరు వారు కాని ఒక నెల ముందుగా షిర్డిలోని ట్రస్ట్ కార్యాలయమునకు ఫోన్ చేసి రూమ్ కన్ఫర్మ్ చేసుకోవలెను.
మనవి: ఉచిత వసతి సౌకర్యము పొందు భక్తులు ట్రస్ట్ వారు నిర్ణయించిన నిర్వహణ (Maintenance) ఖర్చులు చెల్లించ ప్రార్ధన.
విజ్ఞప్తి: అన్నదాన ప్రసాదసేవకు విరాళం అందజేయు దాతలు…ఈ క్రింద పేర్కొన్న బ్యాంకు అకౌంట్ లో జమచేయవలెను.
బ్యాంకు పేరు: ఆంధ్రా బ్యాంకు
అకౌంట్ పేరు: శ్రీ సాయిరమ్య ఛారిటబుల్ ట్రస్ట్
అకౌంట్ నెంబర్: 111211100001787
IFSC Code: ANDB0001112
Branch: Shirdi
శ్రీ సాయిరమ్య ఛారిటబుల్ ట్రస్ట్ పేరు మీద డి.డి.లు చెక్ లు పంపించవలెను ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ సౌకర్యం కలదు. నగదు రూపంలో చెల్లించువారు ట్రస్ట్ అనుమతి పొందిన సభ్యులకు మాత్రమే చెల్లించవలెను. విధిగా రసీదు పొందవలెను. అలా కాని యెడల మీరు చెల్లించిన విరాళములకు ట్రస్ట్ ఏ విధమైన బాధ్యత వహించదు.
ట్రస్ట్ కార్యాలయ చిరునామా:
శ్రీ సాయిరమ్య ఛారిటబుల్ ట్రస్ట్
పింపల్ వాడి రోడ్, షిర్డి
పిన్: 423109