--
You received this message because you are subscribed to the Google Groups "Baba-Satsang" group.
To post to this group, send email to babas...@googlegroups.com.
To unsubscribe from this group, send email to babasatsang...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/babasatsang?hl=en.
ఈ శోక సముద్రం లో ఆమె జీవిత నౌక ఒక ప్రశాంత
ద్వీపానికి చేరింది. ఆమె సుఖ దుఖ్ఖాలకు అతీతమైన తుర్యావస్థ ను చేరుకుంది.
ఇప్పుడు ఆమెకు దుఖ్ఖము లేదు, సుఖం లేదు. జగమంతా ఆ జగన్నాధుని లీలా విలాసమే.
ఎక్కడ చూసినా ఆమెకు భగవత్ సాక్షాత్కారమే. అంతా ఆనందమయమే.
ఆమె ఇల్లు వదిలేసింది. స్మశానం లో, చెట్టు తొర్రలో,
కాలువ గట్టు మీద- ఎక్కడ పడితే అక్కడ తిరుగాడుతుండేది. ఆకలి వేస్తే బూడిద
నోట్లో వేసుకుని ఆకలి తీరింది అనేది. ఆమె ఈ సాధన జనానికి అర్ధం కాలేదు.
కొన్నాళ్ళు ఆమెకు పిచ్చి పట్టిందనే అనుకున్నారు.
ఆమెకు జగత్తంతా శూన్యం గా
కనిపించేది. అలా కొన్నాళ్ళు గడచిన తర్వాత ఒక రోజున ఒక దివ్య జ్యొతి
ఉద్భవించి భూమి, ఆకాశం నిండింది. ఆ వెలుగు లో కిరణాల్లా నడుస్తూన్న చరాచర
ప్రకృతి గోచరించింది. ఆ చిత్ర విచిత్ర వినోదం పరికిస్తూ తన్మయత్వం తో
గంతులు వేసేది. ఆ అనుభూతుల్ని తన వద్దకు చేరిన జనానికి ఆనందం తో
వివరించేది.
ఆమె లోని జ్ఞాన దీపం నలు వేపులా వెలుగులు చిమ్మింది. ఎంతో మంది
భక్తులు ఆమెను సేవించడం, పూజించడం మొదలెట్టారు.
ఆమె ఏ పురాణాల నుండి గానీ, ఉపనిషత్తుల నుండి గానీ
శ్లోకాలు వల్లించేది కాదు.తన సొంత మాటల్లో, సొంత ఫక్కీ లో ఎంతో లోతైన
ఆధ్యాత్మిక సత్యాల్ని, అందరికీ అర్ధమయ్యేలా చెప్పేది.
తన వద్దకు ఒళ్ళంతా బంగారు ఆభరణాలు నింపుకుని వచ్చిన ఓ
వనిత తో, "ఎందుకే ఇన్ని రోతలు పెట్టుకొచ్చావు. ఈ తిత్తి లో గాలి పోతే
అవన్నీ ఎమవుతాయి? అన్న దానం చేసుకోకూడదూ?" అంది. ఆమె వెండి, బంగారం
పొరపాటున కూడా ముట్టుకునెది కాదు. అవి ముట్టుకుంటే ఆమెకు ఒళ్ళంతా
మంటలెక్కినట్లుండేది.
"అసలు మొగుడు భగవతుడొకడుండగా, ఈ మాయ మొగుళ్ళా వలలో
పడిపోయారేంది" అనేది.
తన వద్దకు రావడానికి సంకోచిస్తున్న బ్రాహ్మణుణ్ణి చూసి, "మెడలో
వడికిన పోగులు వేసుకున్నానని గొప్పవాడినని విర్ర వీగుతున్నావా? వడకని
పోగులు నీలోనే ఉన్నాయి చూచుకో" అంది.
పిల్లలు కావాలని ఆరాట పడే ఒక స్త్రీ తో "నీవే ఒక
బొమ్మవైతే, మళ్ళీ నీకొక బొమ్మ కావాలా?" అంది.
పూర్వం తన వద్ద బాకీ తీసుకున్న వాళ్ళు, బాకీ తీర్చడానికి
వస్తే, "వీడికెవదూ బాకీ లేడు, ఎవడికీ వీడు బాకీ లేడు, ఫొ" అని తరిమేసేది.
పిచ్చెమ్మ గారు రమణ మహర్షిని దర్శించింది. "ఎప్పుడూ అంత
దూరం లో ఎమిటి చూస్తావు?" అంది.
రమణ మహర్షి నవ్వుతూ,"నువ్వు చూచేదే నేనూ
చూస్తున్నాను" అన్నారు.
బందరు నొబుల్ కళాశాల కు వచ్చిన మహాత్మా గాంధీ ని గాఢాలింగనం
చేసుకుని "నీవు చాలా మంచి పని చేస్తున్నావు, చేయి" అంది.
గాంధీ గారు కాల్చి చంపి వేయబడ్డారన్న వార్త విని,
"అంతటి పుణ్యాత్ముడి కి నొసటన ఇలా వ్రాసి పెట్టి వుంది. అవును, ఇతడు కూడా
గోవును తుపాకి తో కాల్చి చంపించాడు. ఆ పాపం ఇట్లా ఫలించింది" అన్నదట.
చలం గారు ఆమెను గురించి వ్రాస్తూ, "తెలుగు దేశం లో యోగులు
అవతరించటం వికృతం. పొరపాటున అట్లాంటి వారు ఎక్కడైనా పుట్టినా వారికి ఆదరం
దొరకదు. పిచ్చెమ్మ గారు అట్లాంటిది . ఆమెను గుర్తించక పోతే, గుర్తించినా
ఉపేక్ష చేస్తే ఆ ప్రజలు, ఆ దేశం గొడ్డు పోతుంది" అన్నారు.
పిచ్చెమ్మ తల్లి వంగ దేశంలో పుట్టి వుంటే........
విశ్వమంతా ఆమె నామం వ్యాపించి వుండేది" అన్నారు శ్రీ వేలూరి శివ రామ
శాస్త్రి గారు.
పిచ్చెమ్మ గారు 1951 జనవరి 13 వ తేదీన పరమపదించారు.
ఆమె సమాధి కురుమద్దాలి గ్రామం లో ఉంది.
వెలుగు కు రాని ఎందరో మహానుభావులలో పిచ్చెమ్మ ఒకతె.
On 9/26/12, Subrahmanyam Gorthi <subrahman...@gmail.com> wrote:
> Dear Guru Bandhu Suresh garu,
>
> Sairam. I am not aware of any book containing the life history if Avadhuta
> Mala Pichchamma garu. I will let you know if I come across in future.
>
>
> By the way,
> I have read a nice blog post on Amma's life, and here
> the link.
> One more article on Amma is
> here<http://mahathi.mywebdunia.com/2008/07/19/1216465680000.html>