పెద్దలు ఇక్కడ ఒక విషయం గమనించాలి:
తెలుగు పాఠ్యంశాలుగా బర్మా, మలేశియాలలో చారిత్రాత్మకంగా ఉండేవి; అయితే, 1960లలో బర్మాలో జరిగిన రాజికీయ మార్పుల వల్లా, మలేశియాలో 1991లో జరిగిన పాఠ్యంశాల సరళీకృతీకరణ వల్ల, తెలుగుని ఆయా దేశ బడులలో నేర్పడం మానేశారు. అయినా, ఆయా దేశాలలో అధికారకంగా కాకపోయినా, ఆదివారాల పూట, మామూలు స్కూలు పాఠాలకు అతీతంగా తెలుగుని నేర్పుతున్నారట. మోరిష్యస్ లో ఇప్పటికీ తెలుగుని ప్రభుత్వ బడులలో నేర్పుతున్నారు; అయితే, మోరిష్యస్ కాకుండా మిగతా చోట్ల కేంబ్రిడ్జ్ సిలబస్ నుంచి తెలుగుని 2016 నుంచి తీసేస్తున్నారట.
చెప్పొచ్చేది ఏమిటంటే, నాలుగు ఐదు తరాల బట్టి తెలుగుని అరెబియన్ మహాసగారానికి, బంగాళాఖాతానికి ఇటువైపు అటువైపు నేర్పించేవారు. ఈ విషయం ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ప్రపంచీకరణ నేపధ్యంలో మనం మర్చిపోకూడదు.
--
Akshay Regulagedda | రేగులగెడ్డ అక్షయ్
"Entropy isn't what it used to be." --Source unknown
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.