దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -14ఆధునిక ఆంద్ర గాయకమహాశయులు రాయలసీమ వారు

8 views
Skip to first unread message

gabbita prasad

unread,
Jan 6, 2020, 8:01:21 AM1/6/20
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Vani Kumari Tummalapalli, Vuppaladhadiyam Venkateswara, Vishwanatha Sharma Koride, sastry.su...@yahoo.in, sridakshina murthy sastry tumuluru, Padmasri Potukuchi, Lavanya Pasumarthy, Padma Bulusu, Gopala Myneni, Krishna, vijayalakshmi komali, mrvs murthy, Murali Durga, pkoteswa...@gmail.com, narmad...@gmail.com, veldandan...@gmail.com, vaniprab...@gmail.com, eswarko...@gmail.com, Mohammad Nazeeruddin, Mahejabeen Fathima, madug...@gmail.com, Bharathi Devi Kolli, kasturi v, adinaraya...@yahoo.com

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -14

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు

        రాయలసీమ వారు

1-పక్కా హనుమంతాచారి –(1849-1939)

పంచ కావ్యాలు ముగించి ,కరూర్ లో కరూర్ రామస్వామి వద్ద సంగీతం నేర్చాడు సహాధ్యాయులు శ్రీమతి కోయంబత్తూరు తాయి ,పల్లడం సంజీవరావు గార్లు .వీరి వివాహం ఖర్చు తాయి భరించిందట .శిష్యులు చింతపల్లి వెంకటరావు ,రామచంద్రరావు వగైరా .

2-చింతపల్లి వెంకటరావు –కంచుమోతగాత్రం మంచి బాణీ లయలో దిట్ట .భావగాంభీర్యం రాగరసం సమ్మోహితులను చేస్తుంది .నేక్కార్పట్టు శేషన్నవద్ద గాన మెళకువలు నేర్చాడు .అసాధారణ కల్పనా చిత్ర ధురీణుడు.శరపరంపరగా అపూర్వ రాగాలలో పాడగల  ప్రజ్ఞఉన్నవాడు .పాండిత్యం సాధనతో  అందరినీ ఆకర్షించాడు .మరో గురువు తిరువయ్యార్ సుబ్రహ్మణ్యం .రాయల సీమవారికి ఇతని సంగీతం ఆదర్శం .1944లో చనిపోయాడు .

3-కురుగోడు వెంకటాచలం –కర్నూలు వాడు .నామకల్లు నరసింహయ్య శిష్యుడు .కల్పనా వైచిత్ర్యం స్వరాల అల్లిక జిగి బిగి ఇతని సొత్తు .తమ్ముడు వెంకట నరసయ్య ఫిడలర్ .

4-చలమత్తూరు రామయ్య –పక్కా హనుమంతాచారి శిష్యుడు .శ్రీవిద్యోపాసకుడు .హఠయోగి.ఫిడలర్.అలంకారాలు షట్కాలాల లోను,వర్ణాలను త్రికాలాల్లోనూ గమకబద్ధం గా పాడేవాడు .పావు ,అర్ధ జాగా ఇచ్చి వర్ణ సాధన చేసేవాడు .గతిభేద రహస్యవేది.నాటకురంజి ,కురట,వసంత ,శహన రాగాలను విస్తరించి విసుగు పుట్టకుండా పాడే నేర్పరి .హిందూపురం వాసి .

5-ఆమదాల వెంకటస్వామి –అనంతపురవాసి ఫిడలర్.శిష్యురాలు గుండాసాని .బోధన నిరుపమానం .ప్రక్కవాద్యం నైపుణ్యమున్నవాడు .శిష్యులు నరసింహాచారి ,,భీమసేనాచారి .

   ఒంగోలు సీమ వారు

6-దేనుకొండ చిన్నయ్య –అద్దంకి వాసి 1869-1920కాలం .ఒంగోలుతాలూకా గార్లపాడు గ్రామం లో ఆరువేల నియోగి కుటుంబం లో పుట్టాడు తండ్రి పిచ్చయ్య నృసి౦ హో పాసకుడు,పారిజాతాపహరణం వామన చరిత్ర యక్షగాన కర్త .నిరతాన్న ప్రదాత.శ్రీరామ   ,నృసింహ ఉత్సవాలు ఘనంగా చేసేవాడు .

 ,.14వ ఏట నెల్లూరు తర్వాత మద్రాస్ చేరాడు .పెదకూర సి౦గరాచార్యవద్ద గానం నేర్ఛి తిరువయ్యార్ లో పట్నం సుబ్రహ్మణ్యం వద్ద రెండేళ్ళు సాధన చేశాడు .తర్వాత ఉమయాల్పురం వెళ్లి మహా వైద్యనాధన్ శిష్యుడైన స్వామి నాధయ్య వద్ద 6ఏళ్ళు గానవిద్య అభ్యసింఛి కచేరీ చేసే సామర్ధ్యం సాధించాడు .అయ్యరు గారి 72మేళకర్తలు వల్లించి ,గానరహస్య వేత్తయై ఇంటికి వస్తూ మద్రాస్ లో కచేరి చేసి గానవిదుల మన్నాన పొంది స్వగృహం చేరాడు .ఈయనతోపాటు పై ప్రదేశాలలో విద్యాభ్యాసం చేసిన పరమాత్మునినారాయణ విద్యావినయసంపన్నుడు,రంజక గాత్రజ్ఞుడు కొద్దికాలానికే చనిపోయాడు .కొత్తపల్లి లో పెళ్లి చేసుకొని గానకచేరీలు చేస్తూ మెప్పు పొందాడు .లక్ష్య లక్షణాలతో విద్యార్ధులకు బోధించాడు .ఒంగోలు సీమ పరిసర ప్రాంతాలలో బుద్దాం ,పరుచూరు కావలి దేనుకొండ గ్రామాలలో పాఠశాలలు పెట్టి విద్యాదానం చేశాడు  .

   శిష్యులు –కుందుర్తి రామమూర్తి రామాయణం సీతాపతి ,ఫణిహారం వెంకట సుబ్బయ్య ,ములుకుదురు వెంకట కృష్ణయ్య ,పోతుమర్రి కృష్ణయ్య ,పరమాత్ముని సుబ్బయ్య ,పమిడి ఘంటం సుబ్బయ్య ,ఓగిరాల రామమూర్తి ,ఓరుగంటి వరదయ్య ,పరిమి భద్రయ్య ,దాసరి రత్నం ,గంధం మురహరి షేక్ నబీ ముగాలాయి ,భూసురపల్లి రత్నం,చదలవాడ అచ్చయ్య ,రావినూతుల వరదయ్య ,అమనబ్రోలు దాసు ,విస్సా రామారావు ,కొడుకు సుబ్బారావు మొదలైనవారు.పెదపూడిలో ఇతని గానవిద్యా నైపుణ్యానికి సింహతలాపు మురుగులు చేయిన్చిసత్కారి౦ చారు  గద్వాల్ తిరువాన్ కూర మైసూర్ సంస్థానాలలో గానవిద్య ప్రదర్శించి ‘’లయ బ్రహ్మ ‘’బిరుదు పొందాడు .స్వరకల్పనా చాతుర్య మేటి .స్వరాలను అనర్గళం గా అల్లగల సమర్ధుడు పల్లవి ప్రస్తరణ ప్రవీణుడు .సంగీత శాస్త్ర నిధి .సోదరుడు వెంకయామాత్యుడు యక్షగాన రచయిత శ్రీ రంగనాధ భట్టార్ ఉపదేశం తో విశిష్టాద్వైతం స్వీకరించి తాడిపత్రిలో ఆశ్రమ స్వీకారం చేసి నియమబద్ద జీవితం గడిపి సిద్దుడై1929లో  మరణించాడు .

  కృష్ణా తీర గాయకులు

7-సుసర్ల దక్షిణామూర్తి –(1860-1917 )-గానవిద్యా కులపతి బిరుదు పొందిన శాస్త్రిగారు కృష్ణాజిల్లా పెద కళ్ళేపల్లిలో రౌద్రి సంవత్సర  ఆషాఢ శద్ధ త్రయోదశి జన్మించాడు తండ్రి గంగాధర శాస్త్రి .గానవిద్యకు సంస్కృతం అవసరం అని గ్రహించి వ్యాకరణ మీమాంస ఛందో ఉపనిషత్ కావ్య అధ్యయనం చేశారు .సంగీత సాధనమేమోక్షం అని భావించి తంజావూర్ దగ్గర పంచనద క్షేత్రానికి వెళ్లి ,గాన వరిస్టుడు ఆకుమళ్ళ   వెంకట సుబ్బయ్య వద్ద ,ఆయన శిష్యుడు వీణా ధర్మ దీక్షితార్ వద్దా గురుకులవాసం చేసిగానవిద్య అభ్యసించారు .కొంత లక్షణ గ్రంధాలు కొన్ని గీత వర్ణ కీర్తనలు గ్రహించి తిరిగి వచ్చారు .వాటిలో పైడాల గురుమూర్తి శాస్త్రి 72మేళకర్తలలోని లక్షణ గీతాలు ,ప్రబంధాలు ఘనరాగ గీతాలు తానవర్ణాలు కీర్తనలు మాత్రకాల పద్ధతినింసరించి స్వరపరచి రాశాడు .

 ‘’ లక్ష్య లక్షణ సమన్వితుడైన నాదోపాసకుడైనవాడు రసికుడు .ఉదాహరణ కోనేరు నాగభూషణం .రాగ రూప కాలాలను అనన్య సాదారణంగా చేయగలవాడు భావుకుడు ఉదాహరణ పాల్ఘాటు అనంతరామ భాగవతార్ ,టైగర్ వరదాచారి ..సభికులను ఏదో విధంగా రంజింప జేసేవాడు రంజకుడుఉదాహరణ రామానుజయ్య౦ గారు  . . గాయకుల పోకడలను అనుసరించేవాడు ఉదాహరణ సీతారామా చారి .రసిక గాయకులను తయారు చేసేవాడు శిక్షాకారుడుఉదాహరణ –సుసర్ల దక్షిణామూర్తి ‘’అని హరి నాగభూషణం గారు చెప్పారు వీరిలో పితృస్థానం శిక్షాకారునిది . అంతటి  స్థాయి ఉన్న మహానుభావులు సుసర్ల వారు .అనేకమంది విద్యార్ధులకు భోజనం వసతి తనింట కల్పించి గాన విద్య నేర్పారు. కనుకనే ‘’కులపతి ‘’అయ్యారు .వీరి సవయస్కులు సతీర్ధులు ఫ్లూటు శరభ శాస్త్రి సద్గురు కటాక్షం పొందాడు .గురు శ్రేణికి చెందినవారు పట్నం సుబ్రహ్మణ్యం మహా వైద్యనాధన్ ,పంచాపకేశన్,వీణ ధర్మ దీక్షితులు .

  శాస్త్రిగారు ఆజనుబాహువులు .బ్రహ్మ తేజో విరాజితులు ,అగ్రహారీకులు అవటం చేత కచేరీలు చేసే విద్యార్ధులను తయారు చేశారు .కుమారులు కృష్ణబ్రహ్మం ,నాగేశ్వర శాస్త్రి ,విశ్వపతి శాస్త్రి జంత్ర గాతజ్ఞులు .రాజనాల వెంకటప్పయ్య ,ద్వివేదుల లక్ష్మణ శాస్త్రి నరసింహం సోదరులు ,దుడ్డు సీతారామయ్య ,సింహాద్రి అప్పలాచారి ,చల్లపల్లి పురుషోత్తం ,పంచనాదం సోదరులు, చల్లపల్లి సీతారామయ్య సుబ్బయ్య సోదరులు ,పారుపల్లి రామకృష్ణయ్య ,పెనుమత్స లక్ష్మీ పతిరాజు, కందా రాఘవయ్య ,సుసర్ల గంగాధర శాస్త్రి మొదలైన వారు మెరికల్లాంటి గాన శిష్యులు .శాస్రిగారు 57వ ఏట సాయుజ్యం పొందారు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

  ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-1-20-ఉయ్యూరు

 

 

image.png

 .

 

  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


--




గబ్బిట దుర్గా ప్రసాద్

http://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
             8520805566

Land Line : 08676-232797


Reply all
Reply to author
Forward
0 new messages